జనసేన ఆధ్వర్యంలో సంపర గ్రామ వాసులకు మంచి నీటి సరఫరా
అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, సంపర గ్రామంలో అధికార పార్టీ నిర్లక్ష్యం కారణంగా నాలుగు రోజుల నుంచి కుళాయిలు బాగు చేయకపోవడంతో మంచి నీటి ఎద్దడితో గ్రామ వాసులు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పెదపూడి మండల అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి జనసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి నుంచి వారికి మంచినీరు అందిచడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-10.46.42-PM-1024x768.jpeg)