ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గోపూజ మహోత్సవం

కనుమ పర్వదినాన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. టీటీడీ, దేవాదాయశాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం జరుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. తొలుతగా మున్సిపల్‌ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు.