జనసైనికుడు సోము కుటుంబానికి 30 వేలు ఆర్థికసాయమందించిన గోరంట్ల జనసేన

సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గురువారం కమ్మలవాండ్ల పల్లికి చెందిన జనసైనికుడు సోము ప్రమాదంలో మరణించడం జరిగింది. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. శుక్రవారం గోరంట్ల జనసేన నాయకులు సోము కుటుంబాన్ని పరామర్శించి అతని తల్లిదండ్రులకి 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందచేసారు. అలాగే ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల నాయకులు సంతోష్, అనిల్ కుమార్, రాఘవేంద్ర, నాగేష్, వెలమద్ది శ్రీనివాసులు, శంకర, బాబర్, పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు.