ప్రభుత్వం రైతులకి అండగా నిలబడాలని జనసేన డిమాండ్

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలంలో, మండగ్రామానికి చెందిన మంగయ్య, సిరింగమ్మ కుటుంబానికి చెందిన రెండు ఎకరాల జీడుతోట గత గాలి వానకి తీవ్రంగా జీడుతోట పంట నాశనమైనది. ఈ విషయం తెలుసుకున్న సీతంపేట జనసేన నాయుకులు మరియు జనసైనికులు ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్. సింహాద్రి, ఎస్. రాజేష్, నవీన్, రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ రైతులకి అండగా నిలబడాలి అని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరుపునుంచి డిమాండ్ చేసారు, లేని పక్షంలో అధికారులు దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందని ఆ రైతులుకి భరోసాన్ని ఇవ్వడం జరిగింది.