ప్రభుత్వము నిద్ర లేచి రోడ్డు పనులు చేపట్టాలి: గొర్లె గోవిందరావు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హ్యాస్ ట్యాగ్ గుడ్ మార్నింగ్ సార్ డిజిటల్ క్యాంపైన్ రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు.పోలరాజు (యు.పి.రాజు) నాయకత్వంలో సంతకవిటి మండలంలో జనసేన సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు నిర్వహించారు. ఈ సందర్బంగా గొర్లె గోవిందరావు మాట్లాడుతూ సంతకవిటి నుంచి పొందూరు రోడ్డు మరియు సిరిపురం నుంచి గోకర్ణపల్లి వెళ్లే రోడ్డు అంతా గుంతలమయం అయ్యాయి అని వాహనదారులు ప్రయాణికులు చాలా నరక యాతన పడుతున్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంత్సరాలు అయినా రోడ్లు వేయలేని దుస్థితిలో ఉండటం దారుణం అని.. ఇకనైనా తొందరగా రోడ్లు పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.