కవిటిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలి: దాసరి రాజు

ఇచ్చాపురం, కవిటి మండలలోని చుట్టు ప్రక్కల గ్రామాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కవిటిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఇచ్ఛాపురం జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో బలమైన పోరాటం చేయడానికి జనవరిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పదవ తరగతి మరియు ఇంటర్మీడియేట్ విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడటం వల్ల సమయం తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీ లేవనెత్తిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఎస్.జి.ఎఫ్ సేవా సంస్థ ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న విషయం తెలుసుకొని ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఏప్రిల్ 12 (బుధవారం) న ఈ సమస్యపై కవిటి బస్టాండ్ వద్ద నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు దాసరి రాజు తెలిపారు. అలాగే మిగిలిన స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు తల్లిదండ్రులు, యువత ప్రతి ఒక్కరూ కవిటిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకొరకు చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని కోరారు.