నరసాపురం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్, మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సోమవారం నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలంలోని సెరేపాలెం, కొత్తపాలెంలో పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1.వ ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ అబ్జర్వర్ సూర్యనారాయణ రాజు, జనసేన టిడిపి మండల అధ్యక్షులు కొల్లాటి గోపికృష్ణ, గుబ్బల నాగరాజు, నిప్పులేటి తారక రామారావు దూసనపూడి సత్యనారాయణ, తణుకుల మునీశ్వరరావు, లాక్కు బాబి, కొండేటి తాతాజీ కత్తుల వాసు కొప్పాడ నాగరాజు, బొల్ల చంటి, పాల రాంబాబు జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment