ఘనంగా గురుదత్ జన్మదిన వేడుకలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామ జనసేన ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయించడం జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో గాయపడిన బాధితుడి కుటుంబానికి నిత్యవసర సరుకులు గురుదత్ చేతుల మీదుగా కాపవరం జనసైనికులు సహాయం చేయడం జరిగింది. అనంతరం రాజానగరం మండలం కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీన్మార్ డప్పులతో జన సైనికులు జనసేన నేతల ఆధ్వర్యంలో గురుదత్ కి ఆర్టీసి కాంప్లెక్స్ నందు భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. కోరుకొండ మండలం, సీతానగరం మండలం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గురుదత్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. ముఖ్యంగా పెట్రోల్ బంక్ నుండి లక్ష్మీనరసింహస్వామి గుడి వరకు రోడ్ షో నిర్వహించడం ఈ రోడ్ షో లో భారీగా చేరుకున్న అభిమానుల నడుమ కార్లు, బైక్స్ పాల్గొనడం చాలా విశేషం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కేక్ కటింగ్ అలాగే గజమాలలాతో అనేకమంది పలు గ్రామాల నుండి వచ్చిన వారు పుష్పగుచ్చాలతో గురుదత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల అధ్యక్షులు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ యువనేతలు, జనసేన పార్టీ వీర మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.