సత్యవేడులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సత్యవేడు నియోజకవర్గం, వరదయపాలెం మండలంలో గురువారం వరదయపాలెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో ఉపాధ్యక్షులు తొండంబట్టు శేఖర్ దేవళ్ళ తులసి రామ్ అధ్యక్షతన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమం జరిగాయి. ముఖ్య అతిధిగా జనసేన సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ లావణ్య కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచుకోవాలని తెలిపారు. మండల అధ్యక్షుడు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండల టిడిపి నాయకులు హరి, జనసేన పార్టీ మండల నాయకులు ప్రధాన కార్యదర్శులు శిరీష, యంపళ్ళ వెంకటేష్, జనసేన నాయకుడు కులశేఖర్ రెడ్డి, కార్యదర్శి వసంత్ కుమార్, రమణ, సంయుక్త కార్యదర్శి, ప్రసాద్, పృధ్వి, యుగంధర్ కార్యకర్తలు , అభిమానులు, నాయకులు పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-14-at-17.18.14-1024x576.jpeg)