నెల్లూరులో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభం

  • జనసేన జెండా ఆవిష్కరణ

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 1వ డివిజన్‌లో జనసేన పార్టీ జెండాను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఆ డివిజన్‌ ఇన్‌చార్జి పవన్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అడుగుల జెండాను ఆయన ఆవిష్కరించారు. అదే విధంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కార్యాలయాన్ని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం 1వ డివిజన్‌లో పవన్‌కుమార్‌ యాదవ్‌ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి జనసేన – టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం పవన్‌కుమార్‌.. జనసేన జిల్లా నేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్‌ ఆలియా, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వార్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వార్ బాషా, నాయకులు కంతర్‌, కరీం, అజయ్‌, శ్రీను ముదిరాజ్, సుల్తాన్, ప్రతాప్, జీవన్, కైఫ్, జనసైనికులు, వీరమహిలలు తదితరులు పాల్గొన్నారు.