తునిలో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

తుని నియోజకవర్గం, కోటనందూరు మండలం కె.ఎ మల్లవరం గ్రామంలో చిటికెల విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు హాజరవటం జరిగింది. అలాగే జనసేన పార్టీ తుని నియోజకవర్గం సమన్వయ కర్త చోడిశెట్టి గణేష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు వంగలపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు, కోటనందురు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాసు, చిటికెల విజయ్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రారంభించటం చాలా సంతోషం అలాగే పొత్తులో భాగంగా తుని నియోజకవర్గంలో జనసైనికులకు ఎక్కడా కూడా గౌరవ తగ్గకుండా చూసుకుంటాను అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చిన రాకపోయినా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన సరే మీకు తోడుగా ఉంటాను అని చెప్పటం జరిగింది. అలాగే జనసైనికులు మాట్లాడుతూ పొత్తులో భాగంగా జనసేన పార్టీ ప్రతీ జనసైనికుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్యని అఖన్డ మెజార్టీతో గెలిపించే వరకు మా వంతు కృషి చేస్తాము అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటనందురు మండల టీడీపీ అధ్యక్షులు గాడి రాజుబాబు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు నక్కా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అల్లు లోవరాజు, కోటనందూరు మండల కమిటీ సభ్యులు, తుని టౌన్ జనసేన నాయకులు అద్దేపల్లి బాలాజీ, తుని మండల జనసేన నాయకులు బొప్పన రాంబాబు, తొండంగి మండల ప్రధాన కార్యదర్శి గట్టెం నాగబాబు, తుని మండల ప్రధాన కార్యదర్శి నానాజీ మరియు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజవంతం చెయ్యటం జరిగింది.