యూకే జనసేన ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లండన్, భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యూకే జనసేన సావ్వె ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా లండన్ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. లండన్ నగరంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంబశివ కుమార్ మేకా, చందు సిద్దం, అశోక్ మాజేటి, శంకర్ సిద్దం, జోజిబాబు గుబిలి, కళ్యాణ్ వడ్డి, హనీష్ కుమార్, సౌమ్య కసరాల, వివేక్, వీర మహిళలు మరియు జనసైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.