సుండుపల్లి మండల కేంద్రంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రంలో జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా… జనసేనపార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు తన కష్టార్జితాన్ని ఇచ్చి ఆదుకుంటున్న ఏకైక ప్రజానేత అంటూ ఇది వరకు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మార్పు కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే భావితరాల భవిష్యత్ తరాలకు నిర్మాణాత్మకమైన పునాదులు పడాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలొనే సాధ్యమని ప్రజలందరూ కలిసి ఉమ్మడిగా మా నాయకుడికి రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, రాజగోపాల్, ఆంజనేయులు, బాలాజీ, రెడ్డి, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.