గంపలగూడెంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • జిల్ల ఉపాధ్యక్షులు బొలియ శెట్టి శ్రీకాంత్ ముఖ్య అతిధిగా జనసేనాని పుట్టినరోజు వేడుకలు
  • బీసీ బాలుర వసతి గృహంలో పుస్తకాల్ పంపిణీ
  • కిడ్నీ బాధితులకు ఆరోగ్యకరమైన సరుకులు అందజేత

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెంలో శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం గంపలగూడెం మండలం పెదకొమిర గ్రామం బీసీ బాలురు వసతి గృహం హాస్టల్ నందు 70 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్లు, రబ్బర్లు మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం చెయ్యడం జరిగింది. అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం తోటమూల రింగ్ సెంటర్ దగ్గర కేక్ కటింగ్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వినగడప గ్రామంలో స్కూల్ నందు విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం మరియు వినగడప కట్ట దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వినగడప తండా గ్రామంలో స్కూల్లో ఉన్న పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ రబ్బరు సీట్స్ పంపిణీ కార్యక్రమం మరియు తండాలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాగి పిండి, జొన్న పిండి మరియు సజ్జ పిండి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, గంపలగూడెం మండల అధ్యక్షులు చింతలపాటి వెంకటకృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికుంట కృష్ణ, మండల ఉపాధ్యక్షులు జరపల రామకృష్ణ, పసుపులేటి మాధవరావు, షేక్ నాగుల్ మీరా, తిరుపతి రావు, పెమ్మి రాజు సతీషు, పెమ్మిరాజు శ్రీనివాస్, చిట్యాల వెంకట సత్యనారాయణ, పగడాల కృష్ణ, రవి పట్రా, చింతలపాటి మాధవ, పెమ్మిరాజు దామోదర్ సాయి, రామిశెట్టి అయ్యప్ప, సులగం సాయి రాఘవ, ఉయ్యాల రమేష్, కుసుమరాజు హరి జరపల సాయి మరియు జనసైనికులు అభిమానులు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.