ఘనంగా కావలి జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మరియు కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ అళహరి సుధాకర్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. కావలి పట్టణంలో జెండా చెట్టు దగ్గర నుంచి సుమారు మూడు కిలోమీటర్ల పైన జనసైనికులు మరియు వీర మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు, అనంతరం కావలి జనసేన పార్టీ నియోజకవర్గ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్, అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన ఎన్నారై ఆస్ట్రేలియా కో-ఆర్డినేటర్ కోలికొండ శశిధర్, ఆత్మకూరు నియజకవర్గ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్, కడప నియోజకవర్గ ఇన్చార్జి సుంకర శ్రీనివాస్, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, తెలంగాణ నాయకులు సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు వీర మహిళలు, కావలి పట్టణం నందు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.