మదనపల్లిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

మహాశివరాత్రి సందర్భంగా బుధవారం సిటిఎం రోడ్ లో గల శ్రీ మంజునాథ స్వామి ఆలయం వద్ద పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు నాయిని ఆధ్వర్యంలో మదనపల్లి యువ నాయకులు హరిహరన్ సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిఐ రాజేంద్ర, రిటైర్డ్ హెడ్మాస్టర్ సోమశేఖర్, కుమార్ రాయల్, లతీఫ్, అశోక్, సోను, నవాజ్, ఉమా, హర్ష, సత్య, దినకరచౌదరి, పునీత్ చౌదరి, రియాన్, సుహేల్, భాను, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment