సర్వేపల్లిలో ఘనంగా నాదెండ్ల జన్మదిన వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో గురువారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకు వెళ్లే విధంగా వ్యూహాత్మకంగా తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఇటు జనసేన నాయకులకు, జనసైనికులకి దిశ నిర్దేశాన్ని ఇస్తూ పార్టీని పటిష్టంగా ప్రజల్లో బలంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని 2024లో ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి సంకల్పంతో అహర్నిశలు కష్టపడుతూ తమ సొంత పనులను కూడా పక్కనపెట్టి పార్టీ ఎదుగుదలే ముఖ్యం అనే విధంగా ఎల్లవేళలా శ్రమిస్తున్నటువంటి పీఏపీ చైర్మన్ పెద్దలు నాదెండ్ల మనోహర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకల్లో భాగంగా వెంకటాచలంలోని సెయింట్ జ్యూడ్స్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో బియ్యం, పప్పు దినుసులు వంటి వంట సామాగ్రితోపాటు చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. అదేవిధంగా పెద్దలు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, ఖాజా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.