శిరివెళ్ల జనసేన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
ఆళ్లగడ్డ: శిరివెళ్ళ జనసేన పార్టీ కార్యాలయంలో జనవరి 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ మండలం కన్వీనర్ పసుల నరేంద్ర జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెసరాయి చాంద్ బాషా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ మరియు ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులకు కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ తమ వంతు సహాయ సహకారాలు జనసేన పార్టీ అందిస్తుందని తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఔనత్వం సదా దీనిని కాపాడుకోవడం భారతీయులుగా మన కర్తవ్యం అని పెసరాయి చాంద్ బాషా తెలియజేస్తూ మరోసారి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండెద్దుల ఖాదర్, బావికాడి గుర్రప్ప, పెద్ద బాలయ్య, బాల స్వామి, పెసరాయి ఇబ్రహీం, హనుమంత రెడ్డి, ఇబ్రహీం ఖాన్, నాగరాజు శెట్టి, గౌండ వలి, పల్లె సాగర్, జిల్లెల రాంసుబ్బయ్య, పసుల నందీశ్వర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-12.43.54-PM-1024x458.jpeg)