జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు, పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు తిరుపతిలో శనివారం స్థానిక 14వ డివిజన్ నందు ఆకేపాటి సుభాషిని ఆధ్వర్యంలో ఆ వార్డ్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి అధ్యక్షతన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గం ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి హాజరయ్యారు. ఈ ముగ్గుల పోటీలలో నిలిచిన మహిళా మణులకు వారు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, సుభాషిని లు మాట్లాడుతూ తెలుగువారి ఇంట పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి పండుగ వేడుకలను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలో నిర్వహించడం జరిగిందన్నారు. ముగ్గుల పోటీలలో గెలిచిన మహిళలకు ప్రత్యేక బహుమతులను అందించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. ముఖ్యంగా మహిళలకు జనసేన పార్టీలో మా అధినేత పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తారని, ప్రతి కార్యక్రమానికి మహిళలు ముందుండేలా కార్యచరణ రూపు దిద్దుతారని, జనసేన కుటుంబం స్థానిక మహిళలతో కలిసి ఈ సంక్రాంతి పండుగ వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బలరాం, పవన్, కిషోర్, మనోజ్, వీర మహిళలు రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పాల జోతీ, లక్ష్మి, మధులత, చందన, కోకిల, దుర్గ, దివ్య ముఖ్య నేతలు మధుబాబు, బాబ్జి, ఆనంద్, కొండ రాజమోహన్, దినేష్ జైన్, పార్థు, గుట్టా నాగరాజు, హిమవంత్, వంశీ, హేమంత్, గోపి, పురుషోత్తం, సాయి, నవీన్, దిలీప్, సురేష్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.