బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థులు నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్నారు. వారికి స్థానిక ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

బీహార్‌లోని అమౌర్, కొచాధమన్‌, జోకిహాట్‌, బైసీ, బహదూర్‌గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. వీరంతా హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీని కలువనున్నారు. కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు.