విచ్చల విడిగా గ్రావెల్ దోపిడీ!

  • ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 54వ రోజు
  • 54వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: తొట్టంబేడు మండలం, రౌతు సువరమాల పంచాయతీలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పూల వర్షంతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన ప్రజలు. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. పంచాయతీ పరిధిలో కొండలను, ప్రభుత్వం భూములను తొవ్వి కోట్లకి అమ్ముకున్నారు. గ్రామానికి వెళ్ళే ప్రధాన రోడ్డు గుంతలమయం అయ్యింది, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, తదితర సమస్యలు తెలిపారు, ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్ర శేఖర్, జనసైనికులు హరి కృష్ణ, లక్ష్మి నారాయణ, రాకేష్, తేజ, శివ, నాయకులు దండి రాఘవయ్య, తోట గణేష్, కావలి శివకుమార్, పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.