స్మశాన వాటిక స్థలం కేటాయించాలి: రేగిడి లక్ష్మణరావు
చీపురుపల్లి నియోజకవర్గం: మెరకముడిదం గ్రామంలో దళితులు స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారు. స్మశాన వాటిక లేక గత 70, 80 సంవత్సరాలు నుంచి చెరువుల్లో పాతడం జరుగుతుంది. ఈ సమస్యపై స్పందించిన జనసేన పార్టీ విజయనగరం జిల్లా ప్రసార కార్యదర్శి రేగిడి లక్ష్మణరావు స్మశాన వాటిక స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడుసార్లు చీపురుపల్లి నియోజకవర్గ మంత్రి బొత్స సత్యనారాయణ కనీసం మౌలిక వసతులు లేని నియోజకవర్గ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని మినిస్టర్ మెరక ముడిదాం మండల జడ్పిటిసిగా ఏకగ్రీవమైన చిన్న శ్రీను మండల ప్రజల్ని నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప అభివృద్ధి శూన్యం. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న దళితవాడ వాసులందరికీ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాను. వారం పది రోజుల్లో ప్రకటన చేయకపోతే రిలే నిరాహారదీక్షకి చేపడతానని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-6.42.35-PM-1024x554.jpeg)