గోప్ప దార్శనికుడు బి.ఆర్. అంబేద్కర్

*ఉప్పు వెంకటరత్తయ్య ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి

ప్రముఖ న్యాయవాది, రాజకీయనేత, సంఘసంస్కర్త, ఆర్థిక శాస్త్రవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, మరియు సామాజిక న్యాయం కోసం అనునిత్యం పోరాడిన మహానుభావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు గోప్ప దార్శనికుడు అని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. ఈ సందర్భంగా, ఉప్పు వెంకటరత్తయ్య డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ, “డాక్టర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని జీవితం సూత్రాలుగా గుర్తించారు,” అని తెలిపారు. “భారతదేశం మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా పదవిని చేపట్టి, అంటరానితనం, కులనిర్మూలనకు ఎంతో కృషిచేసి భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన మేధావి,” అని అంగీకరించారు. “అంబేద్కర్ గారు మన రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం పునాదిపై నిలబడాలని విశ్వసించారు,” అని ఉప్పు వెంకటరత్తయ్య పేర్కొన్నారు. “అక్షరమే ఆయుధం, ఆత్మవిశ్వాసమే ఇంధనం, దేశాభ్యుదయం ఈ జీవితం ధ్యేయంగా జీవించగలిగిన త్యాగశీలి,” అని వారు కొనియాడారు.”ప్రజలలో సమత, మమతను కాంక్షించి, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా రక్షణనిచ్చిన దేశప్రజల ఆశాజ్యోతి – భారతదేశ భాగ్యవిధాత డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్, నేటి తరానికి ఎంతో ఆబినందనీయమైన వ్యక్తిత్వం,” అని ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు.

Share this content:

Post Comment