శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరిన గుడివాక శేషుబాబు

అవనిగడ్డ, సామాజిక పింఛన్లు అమ్మ ఒడి పథకం, రైతు భరోసా లాంటి పథకాల ద్వారా కాపులకు ఇచ్చిన లబ్ద్ని కాపు కార్పొరేషన్ నిధులలో ఎలా జమ కడతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మీకు ఉందా అని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అద్యక్షులు గుడివాక శేషుబాబు సవాల్ విసిరారు. ఇప్పటికైనా కాపుల మీద మీకు మీ జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే ఇంతకుముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి అప్పుడు మాత్రమే ప్రజాక్షేత్రం లోకి వచ్చి ఓట్లు అడగాలని ఒకవేళ నెరవేర్చలేక పోతే కాపులను ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని ఒకవేళ అడిగిన చీపుర్లతో కొట్టి తరమడానికి కాపు సోదరులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. విదేశీ విద్యా పథకం, ఎంఎస్ఎంఈ లాంటి పథకాలలో ఇప్పటివరకు ఎంతవరకు లబ్ధి చేకూర్చారు అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యం ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు ఎక్కడ దాక్కున్నారు అని నిలదీశారు.