టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన గూడూరు జనసేన

గూడూరు, కౌలు రైతులకు అండగా జనసేన.. పంట నష్టపోయి, అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేనపార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ అన్నారు. ఎన్నారై జనసైనికుడు మైలవరపు రాజా ఆద్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందిఇంచిన గోడ ప్రతులు, ఆటో స్టిక్కర్లును శనివారం గూడూరు జనసేనపార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులుపాలై ఆత్మహత్య చెసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున 3 వేల మంది రైతులను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత నిధులను సమకూర్చడం జరిగిందన్నారు. ఇప్పటికే రెండు జిల్లాలోని కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించడం జరిగిందని మే 8 ఆదివారం రోజు కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి సాయం అందించడం జరుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం చేస్తున్న ఓదార్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ గోడ ప్రతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా టీం పిడికిలి చేస్తున్న సేవలు వెళకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్, వసంత్, రాజశేఖర్, సాయి, సంతోష్, గుణశేఖర్, శివ, మహేష్, సనత్ తదితరులు పాల్గొన్నారు.