గూడూరు మండలం ముక్కొలు జనసేన పార్టీ గ్రామకమిటీ నియామకం
పెడన, గూడూరు మండలంలోని ముక్కొలు గ్రామం జనసేన పార్టీకి మంచి క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న గ్రామం. జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కృష్ణాజిల్లా కమిటీ నుండి బత్తిన హరిరామ్, కూనసాని నాగబాబు, పండమ్మనేమి శ్రీనివాస్ ముక్కోలు గ్రామంలో జనసైనికులు సమావేశం నిర్వహించి ఆ గ్రామం నుండి ముగ్గురు ముక్కొల్లు గ్రామం త్రీమ్యాన్ కమిటీ వెయ్యటం జరిగింది.
త్రీమ్యాన్ కమిటీ సభ్యులుగా
సమ్మెట శివ
సమ్మెట కాశీ
ముద్ధినెని రామకృష్ణ నియమితులయ్యారు. ఈ ముగ్గురు సభ్యులు ఈ గ్రామంలో జనసేన పార్టీని, పార్టీ సిద్ధాంతాలను జనసైనికుల తో కలిసి ప్రజలకు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెడన జనసేన నాయకులు సమ్మెట బాబు, పుప్పల పాండురంగారావు, ర్యాలీ సత్యనారాయణ, శీరం సంతోష్, జన్యువులు నాగబాబు, నవీన్ కృష్ణ, బోయిన భాస్కర్ రావు, బోయిన నరేంద్ర, కొప్పినేటి శివమణి, పినిశెట్టి రాజు మరియు పెద్ద ఎత్తున ముక్కోలు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-16-at-5.37.04-PM-1024x576.jpeg)