గుంతకల్ ప్రజా దర్బార్: సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి

గుంతకల్ పట్టణంలో స్థానిక పరిటాల కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం, గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో, జనసేన గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ, ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తాగునీటి, డ్రైనేజీ, రోడ్లు, భూ సమస్యలను అర్జీల రూపంలో ప్రస్తావించగా, నాయకులు ఆయా సమస్యలను వివిధ శాఖల అధికారులకు తెలియజేసి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, త్వరలో “తల్లికి వందనం,” మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా ప్రజల అభ్యున్నతికి చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment