విజయనగరం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

విజయనగరం, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు. గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” మొదటి రోజులో భాగంగా. శైవారం విజయనగరం నియోజకవర్గం కంటోన్మెంట్ సెయింట్ జోసెఫ్ స్కూల్ పరిసర ప్రాంత రహదారిలో విజయనగరం జిల్లా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నగరంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై దుస్థితిని “గుంతల “ఆంధ్రప్రదేశ్ కి దారేది” (డిజిటల్ క్యాంపెయిన్) నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మరియు జేఏసీ కమిటీ సభ్యురాలు, విజయనగరం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి, మరియు జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు, మత్స్యకార విభాగ కమిటీ సభ్యులు గనగల రాజు మరియు వీరమహిళలు, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు ప్రసాదుల ప్రసాద్, జొన్నవలస జడ్పిటిసి రమేష్ రాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు కర్రోతు నరసింగరావు, మరియు పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మరియు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు కార్యకర్తలు పాల్గొన్నారు.