క్రియాశీలక సభ్యునికి భరోసా ఇచ్చిన గుంటూరు జనసేన

గుంటూరు, స్థానిక పాత గుంటూరు 8వ వార్డులోని క్రియాశీలక కార్యకర్త అన్నం సత్యనారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బెడ్ రెస్ట్ లో ఉన్నారని… విషయం తెలుసుకుని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నెరేళ్ల సురేష్ సత్యనారాయణని గురువారం కలసి పరామర్శించడం జరిగింది. పార్టీ తనకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని నగర ప్రధాన కార్యదర్శి యడ్ల నాగ మల్లేశ్వరరావు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి శీలం మోహన్, జెట్టి వెంకటేశ్వరరావు, పులిగడ్డ గోపి, పి. ఫణి కుమార్ శర్మ, పమిడి పవన్, అన్నం వెంకటారరావు, ఉలవల వెంకటేశ్వరరావు, సి.హెచ్. బాలు, జడా సురేష్, సి.హెచ్. ప్రసాద్, మాదాసు శేఖర్ మరియు క్రియాశీలక జనసైనికులు పాల్గొన్నారు.