“రౌడీ సేన” అనడాన్ని తీవ్రంగా ఖండించిన గుంటూరు నగర జనసేన

గుంటూరు, జగన్మోహన్ రెడ్డి నరసాపురం సభలో జనసేన పార్టీని, జనసేన పార్టీ శ్రేణులను ఉద్దేశించి “రౌడీ సేన” అనడం చాలా నీచమైన, హేయమైన చర్యగా తీవ్రంగా ఖండించిన గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శులు సూరిశెట్టి ఉదయ్, పావులూరి కోటేశ్వరరావు, బండారు రవీంద్ర, తోట కార్తిక్, సుధా నాగరాజు, తిరుమలశెట్టి కిట్టు, మీడియా కో ఆర్డినేటర్ పుల్లంశెట్టి ఉదయ్. సైకోలకు, గూండాలకు, రౌడీలకు జనసేన పార్టీ “రౌడీ సేన” లాగా కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలోనే నీతి నిజాయితీతో బాధ్యతాయుతంగా విలువలతో రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే గుర్తించుకోండి. కౌలు రైతులు నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే జనసే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించిన సొంత నిధులు వెచ్చించి ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి జనసేన పార్టీ ఆదుకున్నందుకు? రౌడీ సేన అందామా? 30 లక్షల గృహాలు పేద ప్రజలకు నిర్మించి ఇస్తాము అని గొప్పలు చెప్పుకొని, ఘనమైన పబ్లిసిటీ చేసుకొని కనీసం నేటి వరకు లక్ష గృహాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజేసినందుకు రౌడీ సేన అందమా? ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నాటి నుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. గుంతలు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేయకుండా కనీసం పిడికడు మట్టి కూడా రోడ్లోకి వేయకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ వాస్తవాలు ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినందుకు రౌడీ సేన అందామా? రాష్ట్ర ప్రజలకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయ, దీన, హీన పరిస్థితిలో ఉంటే వినడానికి నీకు తీరిక లేకుండా ఉన్నావు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తెలియజేస్తుంటే అందుకు రౌడీ సేన అందామా? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగోగులు వినకుండా వారి సమస్యలు తీర్చకుండా ప్రజలు నిత్సాహాయిస్థితిలో విధి లేక జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నందుకు రౌడీ సేన అందామా? మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి రాష్ట్ర ప్రజల సంపదను వనరులు మీరు మీ నాయకులు అడ్డుగోలుగా దోచుకుంటున్నారు. అందుకు జనసేన పార్టీని రౌడీ సేన అందామా? మీ సొంత జిల్లాలో మీ వ్యక్తిగత స్వార్థ లాభ ప్రయోజనాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సంవత్సర కాలం గడుస్తుంది నిర్వాసితులకు ఇంతవరకు మీరు సరైన వసతులు కల్పించలేదు. మీ సొంత నియోజకవర్గం పులివెందులలో నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు. అందుకు రౌడీ సేన అందమా? జగన్మోహన్ రెడ్డి మీరు కనీసం మీ సొంత జిల్లాకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నందుకు జనసేన పార్టీ రౌడీ సేన అందామా? వైసిపి గుండాల ఆగడాలు భరించలేక రాష్ట్ర ప్రజలు బై …బై…. బాబాయ్ (వివేక) జగన్ బాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీరు గాని, మీ వైసీపి నాయకులు గానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి గానీ జనసేన పార్టీ శ్రేణులు గురించి గానీ తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నామని అన్నారు.