నాదెండ్లను కలసిన గునుకుల కిషోర్
మంగళగిరి: జనసేన పార్టీ పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మంగళగిరి కార్యాలయంలో మర్యాద పుర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు రాజకీయ అంశాల గురించి చర్చించారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ దృష్టిలో అందరూ ఉన్నారు. కార్యక్రమాలు అందరూ కార్యకర్తలను కలుపుకొని చేయవలసిందిగా పిలుపునిచ్చారు. జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసికెళ్ళి ప్రజా ప్రభుత్వం సాధించే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-02-at-7.57.24-PM-1024x1020.jpeg)