హరిరామజోగయ్యని కలిసిన గురాన అయ్యలు
విజయనగరం: మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను పాలకొల్లులో మంగళవారం ఆయన నివాసంలో జనసేన నేత గురాన అయ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, విజయనగరం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా హరిరామజోగయ్య ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, ఓటర్ల అవగాహనలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-23-at-6.07.52-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-23-at-6.07.51-PM-690x1024.jpeg)