పలు కుటుంబాలను పరామర్శించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలంలో పలువురిని జనసేన పార్టీ తరుపున రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించడం జరిగింది.

  • కోరుకొండ గ్రామనికి చెందిన కొచ్చర్ల వీరప్రసాద్ గత కొన్ని రోజుల క్రితం బైక్ ఆక్సిడెంట్ లో గాయాల పాలైన వారిని గురుదత్ ప్రసాద్ పరామర్శించడం జరిగింది.
  • కోరుకొండ గ్రామానికి చెందిన కొచ్చర్ల చిన్నారావు గత కొన్ని రోజులుఘాఆ అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న గురుదత్ వారిని కలిసి ఆరోగ్యానికి పరిస్థితి తెలుసుకున్నారు.
  • పశ్చిమగోనుగుడెం జనసేన పార్టీ యువ నాయకుడు రాచపోతుల సురేష్ అన్నయ్య చిన్నపాప(ఏడురోజులు) అనారోగ్యంతో చనిపోయింది అనే వార్త స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకున్న గురుదత్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది.
  • పశ్చిమగోనుగుడెం, చక్రవర్తుల రాంబాబు తండ్రి ధర్మరాజు గత కొన్ని రోజుల క్రితం కాలం చేశారని వార్త తెలుకున్న గురుదత్ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు తాతాజీ, కొచ్చర్ల బాబి, కొచ్చర్ల భరత్, పెమ్మాడ సతీష్, రాచపోతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.