శ్రీ చింతాలమ్మతల్లి మహాన్నదానానికి విరాళమందించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామ దేవత శ్రీ చింతలమ్మా తల్లి వారి మహా అన్నదానంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొని రుపాయలు 5000/- విరాళమివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, తూర్పుగోనుగూడెం & పరిజల్లిపేట జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు, మన్య శ్రీను, రాజానగరం నియోజకవర్గం వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, రాజానగరం మండల యూత్ ఐకాన్ పల్లా హేమంత్ కలవచర్ల గ్రామ పెద్దలు, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.