గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చేనేత వికాస కార్యదర్శి
రాజంపేట, సిద్ధవటం మండలం, జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. 153 వ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామంలోని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చారని వారందరికీ సమస్త భారతావని నీరాజనాలు అర్పిస్తోందన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-18.02.18-1024x768.jpeg)