మంత్రి నాదెండ్లకు వరి కంకులతో జన్మదిన శుభాకాంక్షలు.!

శ్రీకాళహస్తి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయం నందు నియోజకవర్గ రైతులు, మహిళలు వినూత్నంగా వరి పైరు మోసులతో శుభాకాంక్షలు తెలిపి, కేక్ కటింగ్ నిర్వహించారు. తిరుమల దర్శనం అనంతరం తిరుగుపయనమైన మంత్రికి నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు, పట్టణ అధ్యక్షులు భాగ్యలక్ష్మి, నాయకులు కావలి శివకుమార్, పేట చంద్రశేఖర్, దీనదయాళ్, జనసైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:

Post Comment