నవ్యాంధ్ర రూపశిల్పికి జన్మదిన శుభాకాంక్షలు

*ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
*నవ్యాంధ్ర రూపశిల్పి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది
*ఆంధ్ర రాష్ట్రానికి దారి చూపే దార్శనికుడు సీఎం చంద్రబాబు నాయుడు

సీఎం చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు.. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డ్డే అని పేర్కొన్నారు.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన, చంద్రబాబు నాయుడు సాధించిన విజయాల్ని తెరిచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు అవిశ్రాంత కృషి క్రమశిక్షణ కనిపిస్తాయన్నారు.. అవి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.. అభివృద్ధిని, సంక్షేమాన్ని, సమతూకం చేసుకుంటూ, పరిపాలనలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని ఆయన కొనియాడారు.. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాట అని.. అది చెప్పడమే కాదు దానిని ఆయన ఆచరణలో చూపించిన గొప్ప వ్యక్తి అన్నారు.. అపార పరిపాలన అనుభవం, దార్శనికత ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నవ్యాంధ్ర అభివృద్ధి జరిగి తీరుతుందన్నారు.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎన్నో ఆటుపోట్లను సైతం ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.. కిందపడిన ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు.. అది ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పరిపాలనను పరిచయం చేశారు.. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం – పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతుబజార్ల ఏర్పాటు, వాట్సప్ గవర్నమెంట్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.. ఆయన స్థాపించిన స్వయం సంఘాలు, గ్రామీణ పేదల మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.. డ్వాక్రా సంఘాల విజయ గాధలు తెలుసుకోవడానికి దేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు.. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అన్నారు.. గత వైసిపి పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత చేపట్టడం, తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఊరుకుపోయిన యువతకు, మళ్లీ భరోసా ఇచ్చి, ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం, పెట్టుబడిదారుల్లో మళ్ళీ విశ్వాసాన్ని పాదుకొల్పి పరిశ్రమలు తేవడం వంటి కీలక బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కోరుతూ వారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment