జనసైనికుడు మోహన్ రంగా కు నివాళులర్పించిన వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు జి.ఎల్ మోహన్ రంగా భౌతిక దేహాన్ని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ సందర్శించి, పుష్పగుచ్చాలు ఉంచి, ఘననివాళులు అర్పించారు. అనంతరం ఆయన అకాల కాలమరణాన్ని జనసేన పార్టీ నాయకులు చింతిస్తూ ఆయన పార్థివ మృతదేహం దగ్గర జనసేన పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, అలాగే భవిష్యత్తులో జనసేన పార్టీ మోహన రంగా గారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, గాజుల రఘు, కోటేశ్వరరావు, హేమంత్ కుమార్ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు..