రాఖీ శుభాకాంక్షలు: జనసేన జానీ
పాలకొండ నియోజకవర్గ బొడ్లపాడు జనసేన జానీ మాట్లాడుతూ.. ఈ రోజు రక్షాబంధన్ సందర్బంగా సోదర సోదరీమణులు అందరికి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు తరుపున పాలకొండ నియోజకవర్గం తరుపున, బొడ్లపాడు గ్రామ ప్రజలు అందరి తరుపున ప్రేమపూర్వక రాఖీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ ఈ సృష్టిలో స్వచ్ఛమైన బంధం అక్క తమ్ముళ్లు అలాంటి అన్నా చెల్లుళ్లు అనుబంధం. అలాంటి అపురూప బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి సుభసందర్బంగా ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను ఆలాగే ఆడపిల్లలుపై అత్యాచారాలు అరికట్టే విధంగా చట్టాలు ఉండాలి జనసేన పార్టీ తరుపునుంచి సాటి మనిషిగా కోరుకుంటున్నాననీ జనసేన జానీ తెలియజేసారు.