కావలిలో జనసేనలో భారీ చేరికలు

ఆదివారం సాయంత్రం కావలి మునిసిపాలిటీ పరిధిలోని 10వ మరియు 11వ వార్డ్ కలిపి ఏర్పాటు చేసిన జనసేన సమావేశమును తాశిఫ్, మాల్యాద్రి, మనోహర్, లాయర్ సిద్దు ఆధ్వర్యములో కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళలలు వార్డు యువకులు, పెద్దలు పాల్గొనగా నిర్వహించడము జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి అధికారికంగా కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు, టౌన్ అధ్యక్షుడు పోబ్బ సాయి, అళహరి సుధాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించింది మనకోసం, మన పిల్లల వారి పిల్లల భవిషత్తు కోసం. యుగానికి ఒక పురుషుడు పుడతాడు అలాంటి నిస్వార్థ వ్యక్తి పవన్ అని, నా వెనుక బలం అతనే అని అలానే నేను కావలి నియోజకవర్గం తరుపున మీకు నేను అండగా ఉంటానని, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని పారదోలకపోతే మన ఇల్లు, స్థలాలు, పొలాలు కూడా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుంది అని కావున ప్రతీ ఒక్కరూ మీ కోసం మీపిల్లల భవిష్యత్తు కోసం తప్పక జనసేన, తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పారు. పవన్ కళ్యాణ్ జనసైనికులకు అండగా ఉండేందుకు లీగల్ సెల్ ను ఏర్పాటు చేశారని ఎట్టి పరిస్థితులలో మీమీద ఏలాటి అక్రమకేసులు పెట్టినా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమములో నాయకులు కృష్ణయ్య, నాగార్జున, మస్తాన్, శరణ్, అజయ్, నవీన్, మురళి, ఆలా శ్రీనాథ్, అగస్టిన్, జాని, రాజా మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు.