పాలకొండ జనసేన ఆధ్వర్యంలో “హాలో ఏపీ – బైబై వైసిపి”

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు రుంకు కిరణ్ కుమార్ అధ్యక్షతన “హాలో ఏపీ, బైబై వైసిపి” అనే నినాదంతో కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటరీ వ్యవస్థ చేపట్టిన నిరసనను వ్యతిరేకిస్తూ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మాటలు పూర్తిగా విని మాట్లడాలి అని, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు నమ్మకుండా మీ మనసు సాక్షితో ఆలోచించి మాట్లాడాలి అని, మీరు ప్రజలు కట్టిన పన్నుతో జీతాలు తీసుకొని పాలకవర్గానికి సేవ చేయకుండా, ప్రజలకి మీ సేవలు అందించాలని, మీరు ఇలాంటి ధర్నాలో మండలంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులపైన, ప్రధాన రహదారిపైన చేసి ఉంటే బాగుండేది అని, మండలంలో ఉన్న అధికార నాయకులు కూడా వాలంటీర్లు వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఎలాంటి దుష్ప్రచారాలు చేయకుండా మండలంలో ఉన్న ప్రధాన సమస్యలు పైన దృష్టి సారించి, ప్రజలకి మేలు జరగే పనులు చేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎక్స్ జడ్పిటిసి సభ్యులు నిమ్మల నిబ్రమ్, ఉప అధ్యక్షులు కొత్తకోట వైకుంఠ, దాసరి మహేష్, గోరిశెట్టి ఉమ శంకర్, దీపక్ కళ్యాణ్, లోపెంటి రమేష్, సింహాచలం, హరిబాబు, పసుపురెడ్డి కిరణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.