“హలో దుర్గాడ-చలో చిత్రాడ” – ఇంటింటి ప్రచారం

*దుర్గాడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

“హలో దుర్గాడ-చలో చిత్రాడ” కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు దుర్గాడ గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మార్చి 14, 2025న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరుగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం మరియు విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన నాయకులు, జనసైనికులు నిస్వార్ధంగా ప్రజా సేవలో ముందుండి పని చేస్తున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించడంలో జనసైనికుల అంకిత భావం ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రతి జనసైనికుడు జనసేన సేవకు పూర్తిగా అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పిఠాపురం సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు చిత్రాడ గ్రామానికి హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

WhatsApp-Image-2025-03-11-at-5.17.06-PM-1024x576 "హలో దుర్గాడ-చలో చిత్రాడ" – ఇంటింటి ప్రచారం

Share this content:

Post Comment