*పిఠాపురం బయలుదేరిన ఎచ్చెర్ల జనసైన్యం
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డా. విశ్వక్సేన్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీగా కార్లు, బస్సులతో తరలివెళ్లారు.
పిఠాపురం చిత్రాడలో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం ఎచ్చెర్ల నియోజకవర్గం పైడిభీమవరం ముఖద్వారం నుంచి ఈ రోజు ఉదయం భారీ జనసందోహంతో ర్యాలీగా బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సమన్వయ కమిటీ సభ్యులు కాకర్ల బాబాజీ, వడ్డాది శ్రీనివాసరావు, బాలి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇంచార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో జనసైనికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. జనసైనికులు జాగ్రత్తలు పాటించాలి అని సూచించిన శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు భూపతి అర్జున్, జి. సిగడాం మండల అధ్యక్షులు మీసాల రవి కుమార్, శ్రీకాకుళం జిల్లా జనసేన కార్యదర్శి బొంతు విజయ్ కుమార్, రణస్థలం మండల జనసేన నాయకులు మైలపల్లి రాంప్రసాద్, ఇతర మండల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this content:
Post Comment