పిఠాపురంలో ఈనెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పిలుపు ఇచ్చారు. రాజమండ్రి సిటీ శ్రీకన్య ఫంక్షన్ హాలులో రాజమహేంద్రవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు భోగవల్లి ప్రసాద్, డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో హలో రాజమండ్రి-ఛలో పిఠాపురం అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను దేశవ్యాప్తంగా కొనియాడారు. ఆయన తన సొంత నిధులతో ప్రజా సేవలు నిర్వహించి, ఎంతో మందికి స్ఫూర్తి దాయకులయ్యారని పేర్కొన్నారు. సినిమాలలో కోట్లు గడుపుతూ సొంత ప్రయోజనాలు కాకుండా, పేద ప్రజలకు సేవ చేయాలని సంకల్పించి, తప్పు చేసే వారిని ప్రశ్నించే తత్వంతో జనసేన పార్టీ స్థాపించబడిందని డాక్టర్ కందుల నాగరాజు చెప్పారు. ఈనెల 14న పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకు లక్షలాది మంది జనసైనికులు, వీర మహిళలు పాల్గొనే అవకాశం ఉందని, అందరూ క్షేమంగా విచ్చేసి, సభను విజయవంతంగా ముగించడానికి దోహదపడాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త వై.శ్రీనివాస్, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఏ.ఎన్.వి.ఎస్ రామచంద్రరావు, టూరిజం బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, నిడదవోలు టీడీపీ, జనసేన కమిటీ సమన్వయకర్త పాల వీరాస్వామి, జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ వైవీడీ ప్రసాద్, 200 మంది జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


Share this content:
Post Comment