అభివృద్ధి ఎక్కడ అని చొక్కా పట్టుకొని నిలదీయండి

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం, వావిలేటిపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు గురువారం పర్యటించి, మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు వైసిపి నాయకులు ఈ గ్రామంలో పర్యటించి, అభివృద్ధి చేస్తాము ప్రజా సమస్యలు మొత్తం తీరుస్తాము అని అడ్డు ఆదుపులేకుండా హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొహంసచాటేసి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎస్సి కాలనీల్లో రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య ఉంది, కమ్యూనిటీ హాల్ ని అభివృద్ధి చేయకుండా, నిరుపయోగంగా ఉంచారు. ఊరి నడిబొడ్డులో ఉన్నటువంటి చెరువుని అభివృద్ధి చేయకుండా, చెత్తాచెదారం వేసి చెరువుని ఆక్రమించుకోవడం కూడా జరిగింది. ఇల్లు లేని నిరుపేదలకు జగనన్న కాలనీ ద్వారా ఇల్లు కట్టిస్తాము అని చెప్పి, స్మశానాల దగ్గర ఊరికి చివర్లో అడవిని తలపించే విధంగా ఉన్న జగనన్న కాలనీని చూస్తూ ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో అర్థమవుతుంది. ఈ గ్రామ సమస్యలు మొత్తాన్ని జనసేన నాయకులు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది, వైసిపి నాయకులు ఓట్లు కోసం వస్తే చొక్కా పట్టుకొని నిలదీస్తాము అని గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ గ్రామ ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. జనసేన మరియు టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడానికి విజయం సాధించడానికి కచ్చితంగా అవకాశం ఇస్తాము అంటూ వావిలేటిపాడు గ్రామ ప్రజలు అంటున్నారు అని కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, మరియు స్థానిక జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలియజేశారు.