ఇళ్ళ స్థలాలు ఎవ్వరికీ ఇచ్చారు! అర్హులకా? వైసీపీ కార్యకర్తలకా?

  • ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర – 49వ రోజు
  • 49వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: తొట్టంబేడు మండలం, కాసరం గ్రామంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పూల వర్షంతో, మంగళ వాయిద్యాలతో వినుతకి జనసైనికులు స్వాగతం పలికారు. గ్రామంలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో త్రాగు నీరు సదుపాయం లేదు, సి సి రోడ్డు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం అస్సలు లేదని తెలిపారు. అర్హులైన వారికి ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని వినుత ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్ర శేఖర్, ఉపాధ్యక్షుడు శివ, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, జనసైనికులు శ్రీనివాసులు, మునిరాజా, నాయకులు, దండి రాఘవయ్య, తోట గణేష్, కావలి శివకుమార్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, శారద, సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.