మైలవరం జనసేన ఆధ్వర్యంలో రైతులకు సన్మానం

మైలవరం, చండ్రగూడెం, జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం చండ్రగూడెం గ్రామంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో రైతులను సన్మానించి, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ జనసేనపార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని, మా అధినేత పవన్ కళ్యాణ్ సైతం రైతుల పైన ప్రేమతో జనసేనపార్టీ మేనిఫెస్టోలో సైతం రైతులకు ఉపయోగకరమైన అంశాలను పొందుపరచడం జరిగిందని, అందులోని భాగమే రైతులకు పెన్షన్, ఎకరాకు 8000 రూపాయల రైతుభరోసా ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయని రైతులకు వివరించారు.పవన్ కళ్యాణ్ రైతులను తన సొంత కష్టార్జితంతో ఆర్థికంగా ఈ రాష్ట్రంలో మరణించిన కౌలు రైతులు దాదాపు 3000 మంది రైతులకు లక్షరూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలను ఇస్తున్నారని కొనియాడారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులు పాటిబండ్ల రామచంద్రరావు, పరసా ద్రౌపతిరావు, సంగు అప్పారావు తదితరులకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.