పట్టణానికి రెండు పూటలా నీటి సరఫరా చేయాలి: జనసేన డిమాండ్

ఎమ్మిగనూరు: జనసేన పార్టీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్ లు మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు పట్టణంలో రెండు పూటలా నీటి సరఫరా జరిగే విధంగా మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. రోజు విడిచి రోజు కొళాయిలు వస్తున్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నా మునిసిపల్ అధికారులు పటించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. డైలీ నీటి సరఫరాకు ఎంత సమయం పడుతుందో స్పష్టమైన సమాచారం ప్రజానీకానికి ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. అలాగే ఏవార్డులో ఏ సమయానికి నీళ్లు వస్తాయో ఒక స్పష్టత ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అదేవిధంగా అధికారులు పక్కా ప్రణాళికతో ఎమ్మిగనూరు పట్టణంలో ఉండే ప్రతి వార్డుకి రెండు పూటలా నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షబ్బీర్, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.