ఉప్పరపల్లిలో ఇంటింటికి జనసేన ప్రచారం

*ప్రజలకు కరపత్రాలను అందించిన జనసేన యువ నాయకులు

సిద్ధవటం: రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని రాజంపేట జనసేన పార్టీ యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మల్లి శెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. జనసేన ఇంటింటి ప్రచారం రెండో రోజులో భాగంగా.. మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో సోమవారం ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య హాజరై.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.. జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.