గిరిజన పీటిజీ గ్రామాల్లో ఇంటింటికి జనసేన మాటలు

*జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా అల్లంగి, రామకృష్ణ

అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలము సుంకరమెట్ట పంచాయతీ పరిధిలో గల పేద గంగుడి పీటిజీ గ్రామాల్లో జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయి బాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారము సాయంత్రం ఆయా గ్రామంలో పర్యటించి జనసేన మాటలు ఇంటికి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా సాయిబాబా రామకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని ప్రతి ఒక్కరు ఆదరిస్తూ మద్దతు పలకాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు జానీ, గ్రామస్తులు పాల్గొన్నారు.